Key Points
- స్వదేశీ వాయిస్ టు పార్లమెంట్ ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాల్లో మెజారిటీ ప్రజలు "నో" ఓటు వేశారు
- ఆరు రాష్ట్రాలు మరియు నార్తర్న్ టెరిటోరి 'నో' ఓటును నమోదు చేయగా, ACT 'ఎస్ 'కు ఓటు వేశారు.
- ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బానీసీ అందరు ఆస్ట్రేలియన్లను కలిసి ముందుకు రావాలని కోరారు.
రాజ్యాంగంలో పార్లమెంటుకు స్వదేశీ వాయిస్ ను పొందుపరచాలనే ప్రతిపాదనను ఆస్ట్రేలియన్లు తిరస్కరించారు.
శనివారం జరిగిన చారిత్రాత్మక ప్రజాభిప్రాయ సేకరణ లో భాగంగా మొత్తం ఆరు రాష్ట్రాలు మరియు నార్తర్న్ టెరిటోరి 'నో' ఓటును వేశారు.
మొత్తం జాతీయ గణనలో 'నో' ఓటు ఆధిక్యంలో ఉంది.
కేవలం ACT లో మాత్రం "ఎస్" ఓటును వేశారు.
నిర్ణయం కి నిరాశ చెందిన ప్రధాన మంత్రి ఆంథోనీ మాట్లాడుతూ "మనం ఎలా ఆలోచిస్తున్నామో ఫలితం తెలపలేదని, అయినా ఈ నిర్ణయం మనల్ని విభజించిందని " అన్నారు.

ప్రతిపక్ష నాయకుడు పీటర్ డట్టన్ మాట్లాడుతూ దేశంలో అందరం ఏకంగా ఉండాలని పిలుపునిచ్చారు. అసలు ప్రజాభిప్రాయ సేకరణ ఆస్ట్రేలియా కు' "అవసరం లేదు" అని తెలిపారు.
"ప్రతిపాదన మరియు ప్రక్రియ ఆస్ట్రేలియన్లను ఏకం చేయడానికి రూపొందించబడి ఉండాలి, మనలను విభజించడానికి కాదు" అని ఆయన అన్నారు.

కొంతమంది స్వదేశీ ఆస్ట్రేలియన్లు ఓటు ఫలితం కారణంగా ఒక వారం దీని గురించి మాట్లాడకుండా ఉంటున్నారని , మరికొందరు తరువాత ఏమి జరుగుతుందో అని వేచి చూస్తున్నారు.
ఇండీజీనస్ ఆస్ట్రేలియా మంత్రి లిండా బర్నీ మాట్లాడుతూ ఈ నిర్ణయం చుసిన తరువాత తప్పకుండా మొదటి ప్రజల నుండి నాయకులు పుడతారనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.
ఇండీజీనస్ ఆస్ట్రేలియన్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారించాలని ప్రముఖ 'నో' ప్రచారకర్త న్యుంగ్ గై వారెన్ ముండిన్ అన్నారు.
"కొన్ని స్వదేశీ సమాజాలలో కొనసాగుతున్న హింస, దుర్వినియోగం, బలవంతపు నియంత్రణ మరియు విధ్వంసక ప్రవర్తనపై ప్రజలు దృష్టి సారించాలని " అని ఆయన అన్నారు.
NITV ద్వారా ఫస్ట్ నేషన్ ప్రజల దృక్పథాల ను మరియు SBS నెట్వర్క్ లో voice తో పార్లమెంట్ ప్రజాభిప్రాయ సేకరణ గురించి తెలుసుకోండి.
SBS Voice Referendum portal ద్వారా
60కి పైగా భాషలలోని వీడియోలు మరియు పాడ్ కాస్ట్ లను యాక్సెస్ చేయండి.
Voice Referendum hub on SBS On Demand ద్వారా వాయిస్ రిఫరెండం కు సంబంధించి తాజా వార్తలు మరియు విశ్లేషణలు, తెలుసుకోండి.

