బాహుబలితో మొదలైన రెండు భాగాలుగా సినిమాలు తీయడం, పాన్ ఇండియాగా విడుదల చేయటం అనే ట్రెండ్ ఇప్పుడు శృతి మీరి రాగాన పడుతోంది. ఏ సినిమా చూసినా రెండు భాగాలుగా నిర్మించి, విడుదల చేస్తున్నారు. ఒక వేళ ఇదివరలో విడుదలై ఉంటే సీక్వెల్ పేర రెండో సినిమా తీస్తున్నారు. 2024లో కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యింది.
పెద్ద హీరోల సినిమాలను భారీ వ్యయంతో నిర్మించటం, అది వసూలు చేసుకోవడానికి థియేటర్లలో టికెట్ల రేట్లను పెంచమని ప్రభుత్వాలను బ్రతిమాలుకోవడం కూడా సర్వ సాధారణం అయిపోయింది. పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తప్పక ఘన విజయం సాధిస్తాయి, వసూళ్లు రాబడతాయి అన్న నమ్మకం ఈ సంవత్సరం కొంచెం తడబడట్టుగా కన్పిస్తోంది.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.






