పదేళ్లు గడిచినా, 41 ఏళ్ల ప్రభా అరుణ్ కుమార్ హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. 2015 మార్చి 7న సిడ్నీలోని పరమాట్టా పార్క్లో దారుణంగా హత్య చేయబడిన ప్రభా, ఆమె భర్తతో ఫోన్లో మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.కేసు ఇంకా మిస్టరీగానే ఉండటంతో, న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం మరియు పోలీసులు ఈ కేసులో సమాచారం అందించేవారికి $1 మిలియన్ రివార్డు ప్రకటించారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
Share






