ప్రపంచ ప్రఖ్యాత కథకుల్లో రష్యన్ రచయిత ఆంటొన్ చెహోవ్ మొదటి వరుసలో వుంటారన్నది నిర్వివాదాంశం. కథల్లో వస్తువుతోపాటు, ఒక విలక్షణ శైలితో రచనలు చేసారాయన. ఒకటొ, రెండో, మహా అయితే మూడో పాత్రలు మాత్రమే వుండే కథలతో ఆయన జీవితాన్ని గురించిన గాఢమైన నిజాలను ఆవిష్కరించారు.
అటువంటి రచయితే మన మధురాంతకం రాజారాం గారు. బ్రిస్బేన్ లో ఉంటున్న శారదా మురళి గారు, ప్రఖ్యాత రచయిత్రి తెలుగులో, ఇంగ్లీష్లో కథలు, అనువాదాలు వ్రాస్తూ వుంటారు. 1996 లో మొదలైన కథా రచనతో దాదాపు నలభై తెలుగు కథలు, ఇరవై అనువాద కథలూ ప్రచురించారు. "నీలాంబరి", "మలయ మారుతం" పేర్లతో రెండు కథా సంపుటాలు వెలువరించారు.
ఈ వారం పోడ్కాస్ట్లో ఆయన వ్రాసిన "చేసిన ధర్మం" అనే కథని గురించి మాట్లాడుకుందాం. రెండే పాత్రలూ, రెండే సంఘటనలతో, "ఈ పయనం ఎటు వైపు, ఎంత వరకు" అనే ఆలోచన రేకెత్తిస్తారు రాజారాం. తప్పక వినండి, 29 మార్చి శుక్రవారం "అనగనగా.." కార్యక్రమంలో.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.






